Advertisement

సీఎం జగన్ లేని సమయంలో బొత్సా ఆ పని!

Posted : August 31, 2021 at 3:52 pm IST by ManaTeluguMovies

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు లేదా ఇతర ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న సమయంలో మంత్రి బొత్సా సత్యనారాణ అమరావతి గురించి చేసే వ్యాఖ్యలపై వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమరావతి పై చిచ్చు రాజేసేలా ఆయన మాటలు ఉంటున్నాయి. ఆయన ప్రతి సందర్బంలో కూడా ఏపీ రాజధానిగా అమరావతి ఉండదు అని మాట్లాడటంతో పాటు కొందరిని అవమానించినట్లుగా మాట్లాడుతాడు అంటూ విమర్శలు గుప్పించాడు.

తాజాగా సీఎం సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా బొత్సా మాట్లాడుతూ అమరావతి అనేది 29 గ్రామాల రాజధాని మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేశాడు. కొన్ని లక్షల మంది ఆకాంక్ష అయిన ఏపీ రాజధాని ని అవమానించినట్లుగా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు అంటూ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి లేని సమయంలో బొత్సా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అంటూ బొత్సా పై విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ వాసికి ఏదైనా సమస్య ఉంటే కర్నూలుకు వెళ్లాలి అంటే ఎలా సాధ్యం అన్నట్లుగా విమర్శలు చేశాడు.


Advertisement

Recent Random Post:

Sridevi Drama Company Latest Promo – 22nd September 2024

Posted : September 20, 2024 at 5:59 pm IST by ManaTeluguMovies

Sridevi Drama Company Latest Promo – 22nd September 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad