ప్రస్తుతం ఈ ప్రశ్న దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తొలుస్తూ ఉంది. ఆయన ఏం చెప్పబోతున్నాడు.. ఏ చేయబోతున్నాడు అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్న. నేడు అభిమానులతో రజినీకాంత్ భేటీ అవ్వబోతున్నాడు. గతంలో పలు సార్లు రజినీకాంత్ అభిమానులతో భేటీ అయ్యాడు. కాని ఈసారి భేటీకి చాలా ప్రత్యేకత ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ సారి రజినీకాంత్ తన రాజకీయ భవితవ్యంపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వబోతున్నాడు. తన ఆరోగ్యం విషయంలో కూడా ఉన్న ప్రశ్నలన్నింటికి ఆయన సమాధానం చెప్పనున్నాడు.
రజినీకాంత్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు. కాని ఆయన ఆలోచన ఏంటీ అనేది తెలియదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయి అనేది చూడాలి. ప్రస్తుతం రజినీకాంత్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు విడుదల చేసిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఆ విషయమై కూడా నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత 25 ఏళ్లుగా రజికీకాంత్ రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయాల్లోక రాబోతున్నట్లుగా మూడేళ్ల క్రితం ప్రకటించాడు. కాని ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం అడుగు పడలేదు. నేడు రజినీకాంత్ ఏం మాట్లాడుతాడు అంటూ దేశ విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకుండా మరో పార్టీకి ఏమైనా మద్దతు తెలుపుతాడా అంటూ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికాసేపట్లో రజినీకాంత్ నిర్ణయం ఏంటీ అనేది మీ ముందుకు మేము తీసుకు వస్తాం.
నేడు రజినీకాంత్ ఏం చెప్పబోతున్నాడు?
Advertisement
Recent Random Post:
Andhra Pradesh : వైసీపీలో కొత్త జోష్ నింపుతున్న YS Jagan
Andhra Pradesh : వైసీపీలో కొత్త జోష్ నింపుతున్న YS Jagan