Advertisement

షూటింగ్‌ కు వెళ్లాలంటేనే భయంగా ఉంది

Posted : March 23, 2021 at 4:42 pm IST by ManaTeluguMovies

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ లపై ప్రభావం పడుతోంది. సినిమా షూటింగ్‌ అంటే వందల మంది పాల్గొనాల్సి ఉంటుంది. అందులో ఎవరు ఎలా ఉన్నారో చెప్పడం కష్టం. షూటింగ్‌ ఆరంభం సమయంలో పరీక్ష చేసినా తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం కనుక షూటింగ్ లు కరోనా వ్యాప్తికి మార్గం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇదే విషయాన్ని తాజాగా ఒక చిట్ చాట్‌ లో చెప్పుకొచ్చింది.

ఇటీవల కాలంలో షూటింగ్ కు వెళ్లాలంటేనే భయంగా ఉంది. చాలా మంది షూటింగ్ లో ఉంటున్నారు. వారిలో కొందరు మాస్క్ లు ధరించడం లేదు. మరి కొందరు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. షూటింగ్ సమయంలో మేకప్ వేసుకుని హెయిర్‌ స్టైల్‌ వేసుకుని ఉండటం వల్ల మాస్క్‌ పెట్టుకోలేని పరిస్థితి. తద్వారా షూటింగ్‌ సమయంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనగా ఉంది. ఎవరు దగ్గరకు వచ్చినా కూడా అనుమానించాల్సిన పరిస్థితి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


Advertisement

Recent Random Post:

AP Politics : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP కి భారీ షాక్ | Chittoor

Posted : April 22, 2024 at 6:17 pm IST by ManaTeluguMovies

AP Politics : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP కి భారీ షాక్ | Chittoor

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement