Advertisement

‘భీమ్లా నాయక్’ సీక్వెల్పై క్రేజీ బజ్.. రానా స్పష్టత!

Posted : March 5, 2022 at 11:27 am IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి తొలిసారి నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మలయాళంలో మంచి విజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్ ఇది. అహానికి. ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్గా పవన్ కళ్యాణ్ రిటైర్డ్ మిలటరీ అధికారి డానియల్ శేఖర్గా రానాలు నువ్వా..? నేనా.? అన్నట్లు పోటీ పడి మరీ నటించారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతున్న ఈ చిత్రానికి.. సీక్వెల్ రానుందంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ రానాల అభిమానులు సైతం సీక్వెల్ వస్తే చూడాలని ఆరాటపడుతున్నారు. దీంతో `భీమ్లా నాయక్` సీక్వెల్పై క్రేజీ బజ్ ఏర్పడగా.. రానా దగ్గుబాటి స్పష్టత ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను భీమ్లా నాయక్కు సీక్వెల్ ఉంటుందా..? అని ప్రశ్నించారు.

అందుకు రానా బదులిస్తూ `ఈ కథ ఎక్కడ ఎండ్ అవ్వాలో అక్కడే అయింది. ఇంకా దీనికి సీక్వెల్ ఉంటుందని నేను అనుకోవడం లేదు` అంటూ చెప్పుకొచ్చారు. ఇక రానా వ్యాఖ్యలతో `భీమ్లా నాయక్` సీక్వెల్ ఉండదని స్పష్టంగా అర్థమైపోయింది.


Advertisement

Recent Random Post:

ఏపీకి చేదు వార్త.. ముంచుకొస్తున్న మరో గండం | Heavy Rains To AP

Posted : September 14, 2024 at 12:28 pm IST by ManaTeluguMovies

ఏపీకి చేదు వార్త.. ముంచుకొస్తున్న మరో గండం | Heavy Rains To AP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad