Advertisement

పర్సనల్ స్టాఫ్ కారణంగా మెగా బ్రదర్స్ మధ్య వైరం వచ్చిందా?

Posted : March 25, 2021 at 11:22 pm IST by ManaTeluguMovies

ఉప్పెన చిత్రంతో పంజా వైష్ణవ్ తేజ్ సూపర్ సక్సెస్ ను సాధించాడు. తొలి చిత్రంతోనే వైష్ణవ్ తేజ్ పెద్ద స్టార్ అయిపోయాడు. సాయి ధరమ్ తేజ్ కు కొన్ని చిత్రాలు చేస్తే కాని రాని గుర్తింపు తొలి సినిమాతోనే సాధించాడు వైష్ణవ్ తేజ్. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మధ్య చిన్నపాటి తేడా వచ్చిందని అంటున్నారు. ఎవరో వైష్ణవ్ తేజ్ వద్దకు వచ్చి సాయి ధరమ్ తేజ్ పర్సనల్ స్టాఫ్ వద్ద నుండే ఉప్పెన సినిమాలోని కీలకమైన కటింగ్ సీన్ లీకైందని తెలిపాడు.

అందుకే ముందు నుండీ సస్పెన్స్ గా మైంటైన్ చేస్తున్న కీ పాయింట్ ప్రేక్షకుల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని వైష్ణవ్ తేజ్ కూడా నమ్మేసి వెంటనే సాయి ధరమ్ తేజ్ వద్దకు వెళ్లి ప్రశ్నించడం, తేజ్ కూడా తన స్టాఫ్ ను కూడా కనుక్కోకుండా వాళ్ళ వల్ల జరగదు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పడంతో వైష్ణవ్ తేజ్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ బ్రదర్స్ ఇద్దరూ తమ మధ్య ఉన్న దూరాన్ని పక్కపెట్టి తమ తమ కెరీర్స్ పై దృష్టి సారిస్తారని కోరుకుందాం.


Advertisement

Recent Random Post:

Rana Daggubati on Project K, S.S Rajamouli, Entrepreneurship & Why 80% movies flop?

Posted : May 6, 2024 at 11:41 am IST by ManaTeluguMovies

Rana Daggubati on Project K, S.S Rajamouli, Entrepreneurship & Why 80% movies flop?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement