Advertisement

నన్ను అలా అవమానించారు.. నా పిల్లలకు ఆ పరిస్థితి రానివ్వను: సమీరా రెడ్డి

Posted : March 21, 2021 at 10:08 pm IST by ManaTeluguMovies

చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితులు తన పిల్లలకు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది హీరోయిన్ సమీరా రెడ్డి. కెరీర్ ప్రారంభించముందు స్కూలు దశ నుంచే తన పర్సనాలిటీ, కలర్ ను చూసి తోటి పిల్లలు అవహేళన చేసేవారని చెప్పుకొచ్చింది. అవన్నీ దాటుకుని తాను హీరోయిన్ గా కెరీర్ కొనసాగించానని అంటోంది. భవిష్యత్తులో తన పిల్లలకు ఎదుటి పిల్లలను కామెంట్ చేయకూడదని నేర్పుతానని అంటోంది. ఈ మేరకు తన ఫొటో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఈ విషయాలను చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన సమీరా రెడ్డి తెలుగులో మూడు సినిమాలు చేసింది. చిరంజీవితో జై చిరంజీవ, ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ సినిమాలు చేసింది. రానా హీరోగా వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో వెంకటేశ్ తో కలసి ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆపై మళ్ ఆమె తెలుగు సినిమాలు చేయలేదు. అటుపై 2014లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది.


Advertisement

Recent Random Post:

Weather Update: తెలుగు రాష్ట్రాలను మరోసారి అల్లాడించనున్న నైరుతి రుతుపవనాలు!

Posted : September 14, 2024 at 12:12 pm IST by ManaTeluguMovies

Weather Update: తెలుగు రాష్ట్రాలను మరోసారి అల్లాడించనున్న నైరుతి రుతుపవనాలు!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad