Advertisement

మందుబాబుల తీరు చూసి ఆశ్చర్యపోయిన సునీత

Posted : May 14, 2021 at 8:31 pm IST by ManaTeluguMovies

సింగర్ సునీత తన పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తరుచూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం డ్రామా జూనియర్స్ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు సునీత. అయితే తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో చాలా షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

ఇక సునీత ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్టివ్ సెషన్ పెట్టింది. అందులో కొన్ని పాటలు పాడి అభిమానులను అలరించింది. తెలంగాణలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలందరూ బాధ్యతగా మెలగాలని సునీత కోరుకుంది. మనం బాధ్యతగా ఉంటేనే ఈ ఉపద్రవాన్ని పారద్రోలగలమని చెప్పుకొచ్చింది.

లాక్ డౌన్ ప్రకటన రాగానే వైన్ షాపుల ముందు బారులు తీరిన మందు బాబుల తీరుపై సునీత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకునే బయటకు రావాలని, అంత మంది జనాలు ఒకేచోట గుమిగూడడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని ఆమె ప్రశ్నించింది.


Advertisement

Recent Random Post:

ఆడపిల్లల పై వైసీపీ ట్రోలింగ్..అసెంబ్లీ లో హోంమినిస్టర్ ఆవేదన | Vangalapudi Anitha Emtional

Posted : June 22, 2024 at 7:46 pm IST by ManaTeluguMovies

ఆడపిల్లల పై వైసీపీ ట్రోలింగ్..అసెంబ్లీ లో హోంమినిస్టర్ ఆవేదన | Vangalapudi Anitha Emtional

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement