లెజండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్తిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతుంది. గత నెలలో ఆరోగ్యం విషమించడంతో బాలును వెంటిలేటర్ పై ఉంచిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోన్న విషయం తెల్సిందే. ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగుపడుతున్నా కానీ ఇంకా వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. నిన్న ఎస్పీ చరణ్ మాట్లాడుతూ 20 నిమిషాల పాటు తన తండ్రి వ్యాయామం కూడా చేసారని చెప్పడం విశేషం.
ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ సోకిన బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు. కాగా 13న ఆయన ఆరోగ్యం విషమించింది. యావత్ భారతదేశం బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఇక ఈరోజు కూడా చరణ్ హెల్త్ అప్డేట్ ను విడుదల చేసారు. నాన్న గారు నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఎక్మో, వెంటిలేటర్ సాయం ఇంకా ఉన్నా కానీ త్వరలోనే వాటిని తొలగిస్తారని ఆశిస్తున్నాం.
ఈ సందర్భంగా నాన్న గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోన్న ఎంజిఎం వైద్య సిబ్బందికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నా అని చెప్పారు చరణ్. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు చెబుతున్నట్లు తెలియజేసారు.