Advertisement

ఎక్స్ క్లూజివ్: సుకుమార్‌ శిష్యుడికి ఓకే చెప్పిన మహేష్‌ బావ

Posted : July 24, 2020 at 7:47 pm IST by ManaTeluguMovies

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రోత్సాహంతో సుధీర్‌ బాబు వరుసగా చిత్రాలు చేస్తూ ఉన్నాడు. తన బావ అయిన సుధీర్‌ బాబుకు అవసరం ఉన్న ప్రతి సారి ఏదో ఒక విధంగా హెల్ప్‌ అయితే మహేష్‌ బాబు చేస్తూనే ఉన్నాడు. ఆ కారణంగానే ఇప్పటి వరకు భారీ కమర్షియల్‌ హిట్‌ రాకున్నా కూడా సుధీర్‌ బాబు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తాజాగా ఈయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాను చేశాడు. ఆ సినిమాలో నాని విలన్‌ గా నటించాడు. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని సుధీర్‌ బాబు ఎదురు చూస్తున్నాడు. పోలీస్‌ ఆఫీసర్‌ గా సుధీర్‌ బాబు కనిపించబోతున్నాడు. విడుదలకు సిద్దం అయిన ఆ సినిమా కరోనా కారణంగా ఆగింది.

సుధీర్‌ బాబు తాజాగా సుకుమార్‌ శిష్యుడు అయిన అర్జున్‌ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్‌ అయ్యాడట. స్టోరీ లైన్‌ మరియు స్క్రిప్ట్‌ అంతా కూడా నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. సుకుమార్‌ తెరకెక్కించిన పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు అర్జున్‌ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. సుకుమార్‌ శిష్యులకు మంచి ప్రతిభ ఉంటుందని టాక్‌ ఉంది. అందుకు అర్జున్‌ దర్శకత్వంలో చేసేందుకు సుధీర్‌ బాబు ఓకే చెప్పినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

వీరి కాంబో మూవీని సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని నిర్మించిన ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ అధినేత అనీల్‌ సుంకర నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రంకు సంబంధించి చర్చలు అన్ని పూర్తి అయ్యాయి. స్క్రిప్ట్‌ కూడా దాదాపుగా ఫైనల్‌ అయ్యింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసి ఈ ఏడాది చివరి వరకు సెట్స్‌ పెకి తీసుకు వెళ్లాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారట. విభిన్నమైన కథాంశంతో సుధీర్‌ బాబును దర్శకుడు అర్జున్‌ ప్రజెంట్‌ చేస్తాడేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Telangana : మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షతో వేడెక్కిన రాజకీయం

Posted : July 2, 2024 at 11:46 am IST by ManaTeluguMovies

Telangana : మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షతో వేడెక్కిన రాజకీయం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement