Advertisement

RC15 లో లేడీ విలన్ గా అదరగొట్టనున్న తమన్నా

Posted : August 16, 2021 at 8:24 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రోబో శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ ని దర్శకుడు ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ సరసన కియరా అద్వాణీ కథానాయికగా ఎంపికైంది.

ఇక ఇదే చిత్రంలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా లేడీ విలన్ గా సర్ ప్రైజ్ చేయనుందని తెలిసింది. ఇది హీరోయిన్ కి ధీటైన పాత్ర అని తెలిసింది. ఇక శంకర్ సినిమాల్లో కథానాయికల ఎలివేషన్ ఓ రేంజులోనే ఉంటుంది. అయితే చరణ్ వర్సెస్ తమన్నా ఎపిసోడ్స్ ని ఆయన హైలైట్ చేస్తారనడంలో సందేహమేం లేదు. సైరా నరసింహారెడ్డి తర్వాత మళ్లీ మిల్కీకి మరో బిగ్ జాక్ పాట్ తగిలిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాహుబలి – సైరా చిత్రాలతో తమన్నాకు చక్కని గుర్తింపు దక్కింది. ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లోనే ఆఫర్ అంటే అది మరో లెవల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు 20 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో మెరిపించనున్నారు.

ఒకరు కాదు ముగ్గురు హీరోయిన్లు..

# RC15 లో ఒకరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్. ఇందులో తెలుగమ్మాయ్ అంజలికి శంకర్ అవకాశమిచ్చారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. పాన్ ఇండియా ఆఫర్ తో అంజలి ఖుషీ అయ్యిందన్న టాక్ వినిపించింది.

తెలుగు హీరోయిన్ అంజలి అలియాస్ సీతమ్మ దశాబ్ధకాలంగా కథానాయికగా కొనసాగుతున్నా ఇంకా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరలేకపోయింది. బిగ్ స్టార్స్ తో అవకాశాలు వస్తున్నా సెకెండ్ లీడ్ కే పరిమితవ్వాల్సి వస్తోంది. తమిళంలో ఏలినట్టు టాలీవుడ్ ని మాత్రం ఏలలేకపోయింది. తమిళ్ భాషలో తప్ప తెలుగులో బిజీ నటిగా మారలేకపోయింది.

గతాన్ని పక్కనబెడితే వర్తమానంలో సీతమ్మకు బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. ఇది మెయిన్ లీడా రెండో లీడా? అన్నది పక్కన పెడితే జాతీయ స్థాయి పాపులారిటీ ఉన్న సినిమా కావడంతో అంజలికి జాక్ పాట్ తగిలినట్టేనన్న గుసగుస వినిపిస్తోంది.

ప్రధాన హీరోయిన్ గా ఇప్పటికే కియారా అద్వాణిని ఎంపిక చేయగా ఇప్పుడు అంజలి.. తమన్నా పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఏపాత్రకు ఎలాంటి నటీనటుల్ని ఎంపిక చేయాలి? అన్నదానిపై శంకర్ చాలా సీరియస్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే శంకర్ సినిమా ప్రారంభమవుతుంది. చరణ్-కియరా అద్వాణీ-అంజలి-తమన్నా పాత్రల గురించి రివీలైంది. ఇక బాలీవుడ్ నటుడు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకుముందు నీల్ నితిన్ వంటి స్టార్ ఐ సినిమాలో విలన్ గా నటించారు. మరి ఆయననే మరోసారి ఎంపిక చేస్తున్నారా? అన్నది కూడా వేచి చూడాలి.


Advertisement

Recent Random Post:

Prakasam Barrage Gate : క్లిష్టంగా మారిన బోట్ల తొలగింపు

Posted : September 19, 2024 at 12:50 pm IST by ManaTeluguMovies

Prakasam Barrage Gate : క్లిష్టంగా మారిన బోట్ల తొలగింపు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad