Advertisement

వామ్మో! కన్నడ రీమేక్ కోసం మిల్కీబ్యూటీ మరి అంత ఛార్జ్ చేస్తోందా?

Posted : July 19, 2020 at 8:16 pm IST by ManaTeluguMovies

మిల్కీ బ్యూటీ తమన్నా లాక్ డౌన్ కారణంగా తన పారితోషికాన్ని తగ్గించుకోనుందని వార్తలు వచ్చాయి. తను ఇప్పటిదాకా తీసుకుంటున్న పారితోషికంలో 30 శాతాన్ని కట్ చేసుకోనుందని, ఇది కరోనా వైరస్ కారణంగా సినిమాలు ఆగిపోయి ఇబ్బందులు పడుతోన్న నిర్మాతలకు సహాయపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంటోందని అన్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన వార్త ప్రకారంగా అలాంటిదేం లేదని తేలిపోయింది. తమన్నా ఒక సినిమా కోసం తన కెరీర్ లోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం తమన్నా ఒక కన్నడ రీమేక్ లో నటించడానికి ఎస్ చెప్పినట్లు అధికారికంగా వెల్లడైంది. కన్నడలో సూపర్ హిట్ అయిన లాక్ మాక్ టైల్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తుండగా తమన్నా హీరోయిన్ అని ప్రకటన వచ్చింది. నాగ శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అలాగే కాల భైరవ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమా రేంజ్ అయితే చిన్నదే. అందులోనూ సత్యదేవ్ టాలెంటెడ్ అయినా కానీ ఇంకా చిన్న రేంజ్ హీరోనే. మరి తమన్నా తన పక్కన నటించడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

అయితే క్లోజ్ సోర్స్స్ ద్వారా తెలిసిన విషయమేమిటంటే తమన్నా ఈ చిత్రంలో నటించడానికి దాదాపుగా రెండున్నర కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనుందట. ఇది తను ఇప్పుడు హీరోయిన్ గా అందుకుంటున్న దానికంటే రెట్టింపు. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకు ఎస్ చెప్పినట్లు సమాచారం.

తమన్నా ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే ఆచార్యలో ఒక కీలక పాత్రలో నటించనుంది.


Advertisement

Recent Random Post:

హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హ**త్య | Special Report

Posted : September 16, 2024 at 1:20 pm IST by ManaTeluguMovies

హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హ**త్య | Special Report

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad