Advertisement

మహేష్‌ను వదిలేసి బృందావనం వైపు అడుగులు

Posted : April 28, 2020 at 10:24 pm IST by ManaTeluguMovies

మహేష్‌ 25వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మహేష్‌ 26వ చిత్రాన్ని అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. మహేష్‌ 27 చిత్ర బాధ్యత మళ్లీ వంశీ పైడిపల్లి చేపట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మాఫియా నేపథ్యంలో సాగే ఒక స్క్రిప్ట్‌ను కూడా వంశీ పైడిపల్లి రెడీ చేసినట్లుగా ప్రచారం జరిగింది.

ఏం జరిగిందో ఏమో కాని మహేష్‌ 27వ సినిమా దర్శకుడు మారాడు. పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ మూవీ తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌ 28వ చిత్రంకు వంశీ దర్శకత్వం వహించవచ్చు అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబు సినిమాపై వంశీ ఆశలు వదిలేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కోసం బృందావనం సినిమాకు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఎన్టీఆర్‌ 30 సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో విడుదల కావాల్సి ఉంది. త్రివిక్రమ్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న తదుపరి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన బృందావనం చిత్రం సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. కనుక ఆ సినిమాకు సీక్వెల్‌ అంటే ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Lakshmi Kataksham Trailer | Saikumar | Amani | Surya | Vinay Panigrahi

Posted : April 20, 2024 at 5:17 pm IST by ManaTeluguMovies

Lakshmi Kataksham Trailer | Saikumar | Amani | Surya | Vinay Panigrahi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement