Advertisement

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విరుచుకుపడ్డ కస్తూరి

Posted : November 18, 2020 at 8:09 pm IST by ManaTeluguMovies

తమిళ నటి కస్తూరి శంకర్ విరాట్ కోహ్లీపై విరుచుకుపడింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలో ఈ దీపావళికి క్రాకర్స్ కాల్చకండి, దీపాలతోనే దీపావళిని సెలెబ్రేట్ చేసుకోండి అంటూ ఇచ్చిన సందేశం వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈ ట్వీట్ పై నెటిజన్స్ భిన్న వాదనలు వినిపించారు. వారి కోవలోనే తమిళ నటి కస్తూరి విరాట్ కోహ్లీ మెసేజ్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

“ఈ దీపావళికి దీపాలు చాలా? సరే మరి స్పోర్ట్స్ కార్ ఎందుకు? పొల్యూషన్ కదా సైకిల్ చాలు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇటలీ దాకా ఎందుకు, ప్లేన్ వాడకం కూడా పొల్యూషన్ కదా, ఇండియాలోనే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాల్సింది. విరాట్ కోహ్లీ లాంటి పెద్ద సెలబ్రిటీలు ఏదైనా సందేశం ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. దీపావళి అంటే కొన్ని వేల మంది జీవితాలు ఈ క్రాకర్స్ మీదే ఆధారపడి ఉంటాయి. వారి జీవనాధారం ఈ క్రాకర్స్ ను ప్రిపేర్ చేయడం. హాయిగా బ్రాండ్స్ కు ఎండార్స్ చేయడం కాదు” అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చింది.

ఇప్పుడు కస్తూరి ట్వీట్ వైరల్ అవుతోంది.


Advertisement

Recent Random Post:

ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం | CM YS Jagan Election Campaign

Posted : May 3, 2024 at 12:13 pm IST by ManaTeluguMovies

ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం | CM YS Jagan Election Campaign

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement