Advertisement

వైసీపీని వెంటాడుతన్న ‘ఫిరాయింపు’ పాపం.!

Posted : October 1, 2020 at 3:19 pm IST by ManaTeluguMovies

‘జగనన్న మాట తప్పాడు.. మడమ తిప్పేశాడు..’ అంటూ పార్టీ ఫిరాయింపుల విషయమై సొంత పార్టీలోనే కొందరు గుస్సా అవుతున్నారట. టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. కానీ, ఇంతవరకు ఏ ఒక్కరితోనూ రాజీనామా చేయించలేదు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ‘నీతులు చెప్పేటందుకే, పాటించేటందుకు మాత్రం కాదు..’ అని ఇంకోసారి నిరూపితమయ్యిందిప్పుడు.

గతంలో చంద్రబాబు పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించి.. ఆయనా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. అదే బాటలో ఇప్పుడు వైఎస్‌ జగన్‌ నడుస్తున్నారు. ‘వైఎస్‌ జగన్‌ రాజీనామా చేయమని ఆదేశిస్తే, తక్షణం రాజీనామా చేసేస్తాం..’ అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ తదితరులు చెబుతున్నారు. ఇక, ఆయా నియోజకవర్గాల్లో పార్టీనే నమ్ముకున్న వైసీపీ నేతలు మాత్రం, ఈ ఫిరాయింపుల పర్వంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారట.

చంద్రబాబు హయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో, అంతేమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో దక్కారు. ఈ లెక్కన, 2024 నాటికి అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అయితే వైసీపీ పరిస్థితి ఏంటి.? ఓ డజను ఎమ్మెల్యే సీట్లు అయినా వైసీపీకి వస్తాయా.? రావా.? అన్న చర్చ జరుగుతోందట వైసీపీలో.

‘అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయమే లేదు..’ అంటూ వైసీపీ నేతలు కొంత ‘అతివిశ్వాసం’ ప్రదర్శిస్తున్నారు. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ మారిపోవడానికి పెద్దగా సమయం అవసరం లేదు. జాతీయ స్థాయిలో క్రిమినల్‌ కేసులున్న రాజకీయ నాయకులపై ‘వేటు’ అనే చర్చ జరుగుతున్న దరిమిలా.. రాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయే అవకాశముందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

మరి, ఫిరాయింపు పాపం చంద్రబాబుని వెంటాడినట్లు, వైఎస్‌ జగన్‌ని కూడా వెంటాడుతుందా.? వేచి చూడాల్సిందే.


Advertisement

Recent Random Post:

India hikes import duty on crude and refined edible oils to Support Farmers

Posted : September 15, 2024 at 8:13 pm IST by ManaTeluguMovies

India hikes import duty on crude and refined edible oils to Support Farmers

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad