Advertisement

ఏ త‌ల్లి త‌న కొడుకును ఇలాంటి స్థితిలో చూడ‌లేదు: సుమ‌ల‌త‌

Posted : July 5, 2024 at 6:46 pm IST by ManaTeluguMovies

మేటి న‌టి, రాజకీయ నాయకురాలు సుమలత అంబరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణుకా స్వామి హత్య ఆరోపణల్లో అరెస్ట‌యిన ద‌ర్శ‌న్ గురించి సంచ‌ల‌న‌ ప్రకటనను షేర్ చేసారు. సీనియ‌ర్ న‌టి హృదయపూర్వకంగా అత‌డితో ఉన్న అనుబంధం గురించి ప్ర‌స్థావించారు. ద‌ర్శ‌న్ నా కొడుకు లాంటి వాడు! అని ప్ర‌స్థావించారు. అత‌డిని ఈ స్థితిలో చూడ‌టం ఏ త‌ల్లికీ ఇష్టం ఉండ‌ద‌ని అన్నారు.

రేణుకాస్వామి కుటుంబానికి సంతాపం తెలుపుతూనే.. సుమలత తన సుదీర్ఘ‌ నోట్‌ను ప్రారంభించారు. హ‌త్య‌కు గురైన రేణుకాస్వామికి చట్టపరమైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని, అతడి తల్లిదండ్రులు, భార్య కోసం ప్రార్థిస్తున్నట్లు కూడా సుమ‌ల‌త పేర్కొన్నారు. దర్శన్ అరెస్ట్ గురించి సుమలత మాట్లాడుతూ, ”నా కుటుంబానికి, దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కావడం లేదు. అతడు స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కు మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు.. కొడుకు లాంటి వాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగారు అని పిలిచే అత‌డు జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.

తన కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో చూడటం ఏ తల్లికీ ఇష్టం ఉండదు”అని వ్యాఖ్యానించారు. దర్శన్ ఎప్పటికీ నేరం చేయడనే ఆశాభావం వ్యక్తం చేసారు. దర్శన్ ప్రేమగల.. ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. జంతువుల పట్ల అత‌డికి ఉన్న‌ కనికరం.. అవసరంలో ఉన్న‌వారికి సహాయం చేయాలనే సంకల్పం అతడి వ్య‌క్తిత్వాన్ని సూచిస్తున్నాయి. ద‌ర్శన్ అలాంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను” అని అన్నారు. ”దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతడికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించలేదు.. శిక్షించబడలేదు. దర్శన్‌పై న్యాయమైన విచారణ జరగనివ్వండి”’ అని దర్శన్ భార్య విజయలక్ష్మి, కొడుకు వినీష్ గురించి మాట్లాడే వ్యక్తులను వ్య‌తిరేకిస్తూ దూషిస్తూ సుమ‌ల‌త త‌న‌ నోట్‌ను ముగించారు.

బెంగళూరులోని సుమనహళ్లి బ్రిడ్జి దగ్గర రేణుకాస్వామి మృత‌దేహం ల‌భ్య‌మైంది. కుక్క‌లు పీక్కు తిన్న ద‌శ‌లో మృత‌దేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టంకి పంపించారు. అభిమాని దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు అసహ్యకరమైన మెసేజ్ లు పెట్టాడ‌నే కోపంతో ఈ హ‌త్య జ‌రిగిన‌ట్టు ఇప్ప‌టికే పోలీసులు వెల్ల‌డించారు. జూన్ 10న మందుల దుకాణం కార్మికుడు అయిన‌ రేణుకా స్వామిని దర్శన్, పవిత్ర సహచరులు హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. అనంత‌రం ద‌ర్శ‌న్- ప‌విత్ర స‌హా ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇటీవ‌ల‌ బెంగళూరు సెంట్రల్ జైలులో దర్శన్ .. త‌న‌ భార్య విజయలక్ష్మి, కొడుకు స‌హా సన్నిహిత స్నేహితుడిని కలిశాడు. అతను ఉద్వేగానికి లోనయ్యారు. కేవలం ఒక సెకను మాత్రమే పరిచయం ప్రకారం వారిని క‌లిసాడు. మరుసటి రోజు పవిత్ర పోలీసు కస్టడీలో మేకప్ ఉపయోగించడానికి అనుమతించినందుకు కర్ణాటక పోలీసులు సబ్-ఇన్‌స్పెక్టర్‌కు నోటీసు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

Khairatabad Ganesh Immersion 2024 : గంగమ్మ ఒడిలోకి గణపయ్య

Posted : September 17, 2024 at 1:56 pm IST by ManaTeluguMovies

Khairatabad Ganesh Immersion 2024 : గంగమ్మ ఒడిలోకి గణపయ్య

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad