Advertisement

మైత్రీకి మరో మెగా మూవీ

Posted : March 19, 2020 at 10:49 pm IST by ManaTeluguMovies

మైత్రీ మూవీస్ జోరు మామూలుగా లేదు. ఒకేసారి మూడు మెగా మూవీలు చేసిన సంస్థగా రికార్డులకు ఎక్కేలా వుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా లైన్ లో వుంది. 2021లో ఈ సినిమా వుండొచ్చు. ఈలోగా మరో మెగా హీరో బన్నీ-సుకుమార్ సినిమా ప్రారంభం కాబోతోంది. అది ఈ నెలలో ప్రారంభం కావాల్సి వుంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈలోగా మరో మెగా ప్రాజెక్టుకు దాదాపు చేతిలోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తనతో ఓ సినిమా చేసుకునేందుకు మైత్రీ మూవీస్ కు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. డైరక్టర్ పక్కాగా ఫిక్స్ కాకపోయినా, బాబీ పేరు వినిపిస్తోంది. ఈ విషయంలో అన్నీ పక్కా కావడానికి మరి కాస్త టైమ్ పడుతుంది.

అంటే పవన్ కళ్యాణ్, మెగాస్టార్, బన్నీ ఇలా ముగ్గురితో ఒకే సంస్థ దాదాపు సమాంతరంగా సినిమాలు నిర్మించడం అంటే కాస్త అరుదైన సంగతే. ఇదిలా వుంటే యంగ్ హీరోలు, నాని, విజయ్ దేవరకొండ సినిమాలు కూడా ఇదే టైమ్ లో ప్లానింగ్ లో వున్నాయి.

ఇవన్నీ కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు-పరుశురామ్ ఒకటి డిస్కషన్ ల్లో వుంది. ఇవన్నీ కలుపుకుంటే, దాదాపు అయిదారు వందల కోట్ల రూపాయలు మైత్రీ మూవీస్ ఒకేసారి సినిమాల మీద ఇన్వెస్ట్ చేయబోతోంది అన్నమాట.


Advertisement

Recent Random Post:

YCP Party Office Demolition in Tadepalli : కూల్చివేతల హీట్

Posted : June 22, 2024 at 12:50 pm IST by ManaTeluguMovies

YCP Party Office Demolition in Tadepalli : కూల్చివేతల హీట్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement