Advertisement

భూమా అఖిలప్రియ దంపతులను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు?

Posted : July 17, 2020 at 4:08 pm IST by ManaTeluguMovies

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరియు ఆమె భర్త భార్గవ్‌ రామ్‌లు ఆళ్లగడ్డ తెలుగు దేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నినట్లుగా కేసు నమోదు అయ్యింది. ఎవీ సుబ్బారెడ్డి గతంలో తన హత్యకు అఖిల ప్రియ భార్గవ్‌ రామ్‌లు 50 లక్షల సుఫారీ ఇచ్చినట్లుగా కేసు పెట్టాడు. నా హత్యకు ప్రయత్నించిన వారిని ఇంకా అరెస్ట్‌ చేయక పోవడంతో వారు మళ్లీ తనను హత్య చేసేందుకు ప్లాన్‌ చేసే అవకాశం ఉందంటూ సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

తాజాగా సుబ్బారెడ్డి ఆయన కూతురుతో కలిసి కడప ఎస్పీ అన్బురాజన్‌ ను కలిశారు. ఇప్పటి వరకు వారిని అరెస్ట్‌ చేయక పోవడంకు కారణం ఏంటంటూ ప్రశ్నించారు. వెంటనే వారిద్దరిని కూడా అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ విజ్ఞప్తి నోట్‌ ను ఎస్పీకి అందించడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మళ్లీ కూడా అఖిల ప్రియ తన హత్యకు కుట్ర పన్నుతుందనే అనుమానం వ్యక్తం చేశాడు.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 | Pawan Kalyan ను ఓడించకపోతే నా పేరు పద్మనాభమే కాదు : Mudragada Padmanabham

Posted : April 30, 2024 at 1:24 pm IST by ManaTeluguMovies

AP Elections 2024 | Pawan Kalyan ను ఓడించకపోతే నా పేరు పద్మనాభమే కాదు : Mudragada Padmanabham

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement