Advertisement

తెలుగులో నటించడానికి రెడీ అంటూనే ‘నో’ చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..!

Posted : May 27, 2022 at 7:20 pm IST by ManaTeluguMovies

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తల్లి బాటలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. అయినప్పటికీ జాన్వీ ని టాలీవుడ్ లోకి తీసుకురాడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న శ్రీదేవి కూతురు కావడంతో.. తెలుగు ప్రేక్షకులు జాన్వీని బాగా ఓన్ చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు

అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోని ఈ ముద్దుగుమ్మ కోసం టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. కానీ ఇంతవరకు వర్కవుట్ అవ్వలేదు. జాన్వీకి అసలు తెలుగులో నటించడం ఇష్టం లేదా అంటే.. తెలుగు సినిమాలపై తన కూతురికి ఆసక్తి ఉందని.. తప్పకుండా నటిస్తుందని తండ్రి బోనీ కపూర్ చెబుతున్నారు.

లేటెస్టుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ కోసం సంప్రదింపులు జరిపారని టాక్ నడుస్తోంది. ముందుగా NTR30 కోసం ఎంపిక చేసిన అలియా భట్ నటిస్తుందో లేదో అనే డౌట్ తో జాన్వీని మరో ఆప్షన్ గా పెట్టుకున్నారని అంటున్నారు. మరి ఈసారైనా అమ్మడు ఓకే చెప్తుందా లేదో చూడాలి.

నిజానికి జాన్వీ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానని.. విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని చెప్పింది. కానీ ‘లైగర్’ కోసం పూరీ జగన్నాథ్ ముందుగా జాన్వీ కపూర్ ను ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదని టాక్ వచ్చింది. ఇప్పుడు కొరటాల శివ కూడా తెలుగులో పరిచయం చేయాలని చూస్తున్నారని అంటున్నారు.

జాన్వీ ఓవైపు సౌత్ సినిమాలు చేయడానికి రెడీ అంటూనే అగ్ర దర్శకులతో స్టార్ హీరోల పక్కన నటించే ఆఫర్స్ వస్తున్నా ఎందుకనో ఆలోచిస్తోంది. పోనీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూ బిజీగా ఉందా అంటే అదీ లేదు. రెమ్యునరేషన్ సమస్యా అనుకోడానికి మన నిర్మాతలు డిమాండ్ చేసినంత ఇవ్వడానికి రెడీగా ఉంటారు.

అలాంటప్పుడు మరి జాన్వి తెలుగు సినిమాలకి ఇంతవరకూ సైన్ చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ వర్గాలు శ్రీదేవి కూతురి కోసం ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. అతిలోక సుందరి డాటర్ ఎప్పుడు టాలీవుడ్ లో సినిమా చేస్తోందో అని తెలుగు జనాలు వేచి చూస్తున్నారు. మరి ఈ బ్యూటీ ఏ సినిమాతో అరంగేట్రం చేస్తుందో చూడాలి.

ఇకపోతే జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీలో ‘దోస్తానా 2’ సినిమా చేస్తోంది. అలానే తమిళ్ రీమేక్ ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.


Advertisement

Recent Random Post:

Tirumala Temple : తిరుమల కొండపై స్టేట్‌ విజిలెన్స్‌ దృష్టి || CM Chandrababu

Posted : July 2, 2024 at 1:58 pm IST by ManaTeluguMovies

Tirumala Temple : తిరుమల కొండపై స్టేట్‌ విజిలెన్స్‌ దృష్టి || CM Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement