Advertisement

మంచి రోజులొచ్చాయంటున్న మారుతి

Posted : June 9, 2021 at 9:42 pm IST by ManaTeluguMovies

విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్, రాశి ఖన్నాలతో పక్కా కమర్షియల్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేకు పడింది. అయితే ఈలోగా మారుతి ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసాడు.

ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో సక్సెస్ ను అందుకున్న సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ కథానాయికగా ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసాడు. చాలా తక్కువ మంది క్రూతో కేవలం 40 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలా మారుతి అనుకున్నాడు.

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలవుతుంది. దీనికి మంచి రోజులొచ్చాయి అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్ ను ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారో ఇంకా క్లారిటీ లేదు.


Advertisement

Recent Random Post:

YSRCP : అటు బస్సు యాత్ర.. ఇటు చేరికల మాత్ర | CM Jagan | Super Prime Time

Posted : April 20, 2024 at 9:39 pm IST by ManaTeluguMovies

YSRCP : అటు బస్సు యాత్ర.. ఇటు చేరికల మాత్ర | CM Jagan | Super Prime Time

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement