Advertisement

గుర్తుందా శీతాకాలం… మరో ఇద్దరు భామలు వీళ్ళే

Posted : September 30, 2020 at 7:57 pm IST by ManaTeluguMovies

టాలెంటెడ్ నటుడిగా సత్యదేవ్ కు కొద్ది కాలంలోనే మంచి పేరొచ్చింది. ఇటీవలే సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న తేడా లేకుండా సత్యదేవ్ మంచి పాత్ర అయితే చేస్తున్నాడు.

అలాగే సత్యదేవ్ రీసెంట్ గా గుర్తుందా శీతాకాలం అనే సినిమాను చేస్తోన్న విషయం తెల్సిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టైల్ చిత్రానికి ఇది రీమేక్, నాగశేఖర్ దీనికి దర్శకుడు. సత్యదేవ్, తమన్నా కాంబినేషన్ వినడానికే చాలా కొత్తగా ఉంది.

ఈ సినిమాలో తమన్నా కాకుండా మరో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉందని తెలుస్తోంది. అయితే వారు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ రెండు పాత్రలకు ప్రియా భవాని, శంకర్ రితికా సింగ్ లను అనుకుంటున్నారట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

మరి ముగ్గురు అందమైన భామలతో ఈ సినిమా కలర్ ఫుల్ గా ఉంటుందన్న విషయం తెలుస్తోంది. మరి చూడాలి గుర్తుందా శీతాకాలం ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకోగలదో!


Advertisement

Recent Random Post:

TS Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు మిత్రుల కథ | CM Revanth Reddy | Komatireddy Brothers

Posted : April 22, 2024 at 12:11 pm IST by ManaTeluguMovies

TS Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు మిత్రుల కథ | CM Revanth Reddy | Komatireddy Brothers

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement