Advertisement

రూ.25 లక్షల నుండి రూ.60 లక్షలు.. ఇది సామ్ ఇన్ స్టాగ్రామ్ రేంజ్

Posted : March 28, 2022 at 10:25 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ తో పాటు ఇప్పుడు కోలీవుడ్ బాలీవుడ్ అన్ని చోట్ల కూడా మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన ఫోటోలు మరియు వీడియో లను రెగ్యులర్ గా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను ఈమె సొంతం చేసుకుంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో సమంత కు అత్యధికంగా 22.8 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ స్థాయి ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సమంత రెగ్యులర్ గా తన పర్సనల్ పోస్ట్ లను మాత్రమే కాకుండా ప్రమోషనల్ పోస్ట్ లను కూడా షేర్ చేస్తుంది. ఇన్ స్టా లో సమంత ప్రమోషనల్ పోస్ట్ లను రకరకాల రేంజ్ లో షేర్ చేస్తుందట. అంటే ఆమె షేర్ చేసే విధానం ను బట్టి ఆమె పారితోషికం ఉంటుందని తెలుస్తోంది. పాతిక లక్షల రూపాయల నుండి 60 లక్షల రూపాయల వరకు ఆమె పారితోషికం ఉంటుందట.

సమంత ఏదైనా ప్రమోషనల్ పోస్ట్ ను స్టోరీ లో పెట్టి.. దాని గురించి ఏమైనా పాజిటివ్ గా కామెంట్ చేస్తే దానికి పాతిక లక్షల వరకు పారితోషికం అందుకుంటుందట. ఇక రెగ్యులర్ పోస్ట్ గా షేర్ చేస్తే 40 లక్షల వరకు వసూళ్లు చేస్తుందట. రెగ్యులర్ పోస్ట్ పర్మినెంట్ గా ఆమె ఇన్ స్టా ఖాతాలో ఉంటుంది. ఇక ఏదైనా ఒక ప్రోడెక్ట్ గురించి సమంత మాట్లాడటం లేదా.. ఆ ప్రోడక్ట్ తో ఫోటో షూట్ చేసి దాన్న ఇన్ స్టా లో రెగ్యులర్ షేర్ చేస్తే అప్పుడు 50 నుండి 60 లక్షల వరకు కూడా వసూళ్లు చేస్తుందట.

మొత్తానికి సమంత నెలలో కనీసంగా కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు ఈ ప్రమోషనల్ పోస్ట్ ల ద్వారా సంపాదిస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల గుసగుసలు. ఆ స్థాయి లో కాకున్నా కనీసం కోటి అయినా నెల నెల ఆమె కు ఇన్ స్టా గ్రామ్ కారణంగా వస్తున్నాయని టాక్. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఇదే కాకుండా ఈమద్య కాలంలో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలకు హాజరు అవ్వడం వల్ల కూడా భారీగానే ఆదాయం లభిస్తుంది.

ఇలా అనేక రకాలుగా సమంత సంపాదిస్తూనే ఉంది. ఇక లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ఈమె బిజీగా ఉంటుంది. శాకుంతలం.. యశోద ఇంకా కొన్ని సినిమాలను కూడా ఈమె చేస్తోంది. హిందీలో వరుణ్ దావన్ తో సమంత సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమాకు గాను రెండున్నర నుండి మూడు కోట్ల పారితోషికం అందుకోబోతుంది అనేది టాక్.

తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలకు భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రికార్డ్ బ్రేకింగ్ పారితోషికంను అందుకుంటున్న ఈ అమ్మడు ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లకు కోట్ల పారితోషికాలు తీసుకోవడం ఆమెకే చెల్లింది. తన పర్సనల్ పోస్ట్ లు మూడు నాలుగు పెట్టిన తర్వాత ఒక యాడ్ పోస్టర్ ను షేర్ చేస్తుంది.


Advertisement

Recent Random Post:

తెలుగు రాష్ట్రాల గురించి మోదీ చెప్పింది ఇదే..!

Posted : May 2, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

తెలుగు రాష్ట్రాల గురించి మోదీ చెప్పింది ఇదే..!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement